మాదాపూర్ శిల్పారామంలో అలరించిన కూచిపూడి, కథక్ నృత్య ప్రదర్శనలు
మాదాపూర్ శిల్పారామంలో అలరించిన కూచిపూడి, కథక్ నృత్య ప్రదర్శనలు
మాదాపూర్ 25.06.22: మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సైనృత్య అకాడమీ టెక్సాస్ , యూ ఎస్ ఏ గురువర్యులు శ్రీదేవి యడ్లపాటి శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన మరియు శాశ్వతి బనెర్జీ శిష్య బృందం కథక్ నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. టెక్సాస్ లో కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకుంటున్న శ్రీ దివ్య స్ఫూర్తి, దాక్షాయణి, శ్రావ్య , సంజన, జస్మితా లు బ్రహ్మాంజలి, రామాయణ శబ్దం, అదిగో అల్లదిగో, ఇదిగో భద్రాద్రి , ముద్దుగారేయ్ యశోద, జనుత శబ్దం మొదలైన అంశాలను ప్రదర్శించి మెప్పించారు.
శాశ్వతి బనెర్జీ శిష్య బృందం గురు వందన, దాద్రా, ప్రార్ధన, తుమ్మేటి, తరణ మొదలైన అంశాలను మైత్రేయి, అద్విక, ఇషితా, ప్రిశ,కృతిక మొదలైన వారు ప్రదర్శించారు. కారిణి విచ్చేసి ప్రదర్శించిన కళాకారులను ప్రోత్సహించారు.